Wednesday, May 14, 2025

ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబే సమాధానం చెప్పాలి…టీటీడీ చైర్మన్ భూమన

నారద వర్తమాన సమాచారం

తిరుపతి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబే సమాధానం చెప్పాలి…టీటీడీ చైర్మన్ భూమన

ఆ యాక్ట్ ను కేంద్రంలో బీజేపీనే తెచ్చింది….

ఇంత వరకు యాక్ట్ మీద ప్రాథమిక చర్చ కూడా సరిగ్గా ఆరంభం కాలేదు….

దాని మీద జగన్ మోహన్ రెడ్డి చాలా స్పీడ్ గా పోతున్నాడంటూ చంద్రబాబే మళ్లీ ప్రచారం చేస్తున్నాడు….

చంద్రబాబుకు వంత పాడే పత్రికల్లో కూడా మరొక విషయమే లేనట్టు రాస్తున్నాయి…

తప్పు మీదైతే, నెపాన్ని మా మీదనెడుతారా….

గోతికాడ గుంట నక్క లా కూర్చుని అవకాశం దొరికితే ఏదంటే అది మాట్లాడడం చంద్రబాబు నైజం…

పెన్షన్ల పాపం చంద్రబాబుదే…

దుర్మార్గమైన ప్రచారం చేసి, ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేయడం వల్లే లబ్ధిదారులకు నష్టం….

వృద్ధులంతా నరకయాతన పడుతున్నారు…

కానీ, జగన్ మీద నెట్టి లబ్ధిపొందాలని
చంద్రబాబు, ఆయనకు వంత పాడే మీడియా
చూస్తోంది….

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీద
లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు….

జగన్ మోహన్ రెడ్డి మీద కోపాన్ని వృద్ధులు, దివ్యాంగుల మీద తీర్చు కునే ప్రయత్నం దారుణం….

ఓట్లు రావడం లేదని తెలిసి వాళ్లు మాట్లాడుతున్న మాటలను సమాజం గమనిస్తోంది….

తెలుగుదేశం, జనసేన దిగజారి పోయాయి….

పవన్ కల్యాణ్ బజారు మనిషిలా రోజూ అసహ్య ప్రసంగాలు చేస్తున్నాడు….

పవన్ కల్యాణ్ కి రాజకీయ పరిజ్ఞానం లేదు…

రాజకీయాలంటే అవతలి వాళ్లని తిట్టడమే అనుకుంటున్నాడు….

జగన్ మోహన్ రెడ్డి ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని దారుణంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు….

రాజకీయ పరిణతి లేని వ్యక్తిగా స్పష్టంగా అనేక సందర్భాల్లో నిరూపించు కున్నాడు‌…

ఆయనకు తగట్టుగానే ఆయన పార్టీ నాయకులు, అనుచరులు, అభ్యర్థులు తయారైనారు…

పవన్ కల్యాణ్
తిరుపతిలో 30 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆరణి శ్రీనివాసులు కి టికెట్ ఇచ్చాడు….

ఆరణి శ్రీనివాసులు తిరుపతి లో రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు…

ఆరణి శ్రీనివాసులు మెదడు, కోడిపుంజుకు మెదడు ఎంత ఉంటుందో అంత ఉంటుంది….

కోడిపుంజు బుర్రంత మెదడు ఉన్నోడైన ఆరణి శ్రీనివాసులు మా గురించి మాట్లాడుతున్నాడు….

మా పరిజ్ఞానం గురించి నోరుపారేసు కుంటున్నాడు….

చిత్తూరులో అనినీతి, కబ్జాలకే ఆ ఉన్న కోడిపుంజు అంత మెదడు కూడా వాడేసినాడు….

తిరుపతి ఖాళీగా ఉందకుని ఇక్కడకు వచ్చినాడు….

తిరుపతి లో ఏమి చేస్తారో చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది…

మా వాళ్ల మీద వల విసిరే ప్రయత్నం చేస్తున్నాడు…

70 లక్షలు ఇస్తాం, కోటి రూపాయలిస్తాం అని ఆశ చూపితే ఎందుకు అమ్ముడుపోతారు…

రాజకీయం అంటే ఇది కాదు, ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాలి…

ప్రజలను ఓట్లు అడగకుండానే ప్రెష్ గా మేకప్ వేసుకుని తిరుగుతున్నారు…

నాలుగు పాంప్లేట్లు ఇచ్చేది, మమ్మల్ని తిట్టేదే వాళ్ల ప్రచారం….

మంచి వ్యక్తులైన
గురుమూర్తి, భూమన అభినయ్ కి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా…

ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి చంద్రబాబు వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భూమన స్పందించారు…

స్థానిక కొర్లగుంటలో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading