Tuesday, May 20, 2025

అచ్చంపేట మండలం కొండూరు మరియు నిండుజెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో :భాష్యం ప్రవీణ్:

నారద వర్తమాన సమాచారం

ఈరోజు అచ్చంపేట మండలం కొండూరు మరియు నిండుజెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని గ్రామ దేవతలను దర్శించుకున్న అనంతరం రేపు జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్(ఈవీఎం) సంఖ్య 3 సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం – జనసేన – బి జె పి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

భాష్యం ప్రవీణ్  మాట్లాడుతూ:- 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటు ఒక్క అవకాశం అంటూ మోసపూరిత అబద్ధపు హామీలతో గద్దెనెక్కాడని అన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమం పేరుతో పేద బడుగు బలహీన వర్గాలకు నామమాత్రంగా డబ్బు ఆశ చూపించి వాళ్ళని మోసం చేశాడు అని అన్నారు. నిత్యవసర సరుకులు, కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు ప్రతి వస్తువుపై జే టాక్స్ విధించి మామూలు వసూలు చేస్తున్నాడు అని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇంతటి ఎండలో కూడా లెక్కచేయకుండా మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మరియు భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ తారీకు బ్యాలెట్ బాక్స్ (ఈవీఎం) సంఖ్య 3 సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం – జనసేన – బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page