నారద వర్తమాన సమాచారం
నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్
తెలంగాణ
:మే 21
నేడు తిరుమలకు తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నా రు.నేటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యా హ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు.
ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు జరుగనుంది. ఇక అనంతరం ఏపీకి వెళతారు
ఇక ఇవాళ రాత్రి లేదా సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించు కునే ఛాన్స్ ఉంది.
అయితే.. తిరుమలకు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ వెళతారా ? లేదా ? సీఎం హోదాలో వెళ్లి….తిరు మల శ్రీవారిని దర్శించుకుం టారా ? అనేది తెలియాల్సి ఉంది.
ఇవాళ్టి నుంచే తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. దీంతో నేరుగా తిరుమల శ్రీవారిని దర్శిం చుకోనున్నారు సీఎం రేవం త్. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.