Tuesday, May 20, 2025

బాసరలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నారద వర్తమాన సమాచారం

బాసర ఆర్‌జీయూకేటీ ప్రవేశాలు జూన్ 1 నుండి షురూ!

తెలంగాణ

: మే 28
బాసరలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.వెంకటరమణ సోమవారం హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1,500 సీట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అందులో 15 శాతం సీట్లకు తెలంగాణ తోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చని పేర్కొన్నారు.

ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తామన్నారు. తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉండగా..రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్న వారు ఆ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

దానికితోడు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.వెయ్యి, కాషన్‌ డిపాజిట్‌ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700… మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుంద న్నారు…

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page