
నేతాజీ యువజన సంఘం కోసం వంగూరి కృష్ణ చేసిన సేవలు మరువలేనివి.
సంతాప సభలో పాల్గొన్న నేతాజీ యువజన సంఘం సభ్యులు
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
నేతాజీ యువజన సంఘం కోసం వంగూరి కృష్ణ చేసిన సేవలు మరువలేనివని నేతాజీ యువజన సంఘ సభ్యులు తెలిపారు.
పురపాలక కేంద్రంలో ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో నేతాజీ యోజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడిగా, సభ్యుడిగా, ఒక క్రీడాకారుడిగా సంఘ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేసిన వ్యక్తి కృష్ణ అని వారు తెలిపారు. ఆయన లేని లోటు
పూడ్చలేనిదిని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గునిగంటి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మతాల వెంకటేష్ గౌడ్, తడక గౌరీ శంకర్, కోశాధికారి డబ్బికారు సాహెష్, సీనియర్ సభ్యులు కర్నాటి అరవింద్, పోతగల దానయ్య, నాగరాజు, వేముల పాండు, హరి శంకర్, తండా రమేష్, వంగూరి రాజు, సభ్యులు కుడికాల రామ్ నరసింహ, వంగూరి పాండు, కీర్తి సంజీవ, కటుకూరి పాండు, వంగూరి శేఖర్, గునిగంటి వెంకటేష్, శంకర్ ముప్పిడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.