
నారద వర్తమాన సమాచారం
జూన్ :10
మాజీ మంత్రి బొత్సపై ACBకి ఫిర్యాదు
ఆంద్రప్రదేశ్ టీచర్ల బదిలీల్లో మాజీ మంత్రి బొత్స
సత్యనారాయణ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని
టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
టీచర్ల బదిలీ కోసం ఒక్కో టీచర్ వద్ద రూ.3 లక్షల
నుంచి రూ.6లక్షలు వసూలు చేశారని పేర్కొన్నారు.
మొత్తంగా రూ.65 కోట్ల వసూళ్లకు బొత్స పాల్పడ్డారని
ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక టీచర్ల బదిలీలు
చేశారని తెలిపారు.








