నారద వర్తమాన సమాచారం
జూన్ :13
అమరావతి:
సీఎం చంద్రబాబు పేషీలోకి తొలి అధికారి..
సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియామకం..
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్
ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీగా జలుమూరు వాసి ముద్దాడ రవిచంద్ర
నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సవిరిగాం గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు అరుదైన అవకాశం లభించింది. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీగా మరియు సీఎంఓ కార్యాలయం చీఫ్ గా నియమించారు. ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు.
ఈ క్రమంలో సవిరిగాం వాసికి అరుదైన అవకాశం రావడంతో స్థానిక గ్రామంతో పాటు నరసన్నపేటలో పలువురు అభినందనలు తెలియజేశారు.