

డాక్టర్ బాలుకు రాజ్ భవన్ కి ఆహ్వానం..
రేపు రాష్ట్ర గవర్నర్ చే ఉత్తమ రక్తదాత పురస్కారం..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 13:
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని రాజ్ భవన్ నుండి రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలుకు 73 సార్లు రక్తదానం చేయడమే కాకుండా,తల సేమియా చిన్నారుల కోసం 2306 యూనిట్ల రక్తాన్ని సంవత్సర కాలంలోనే సేకరించినందుకు కాను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ద్వారా రేపు అవార్డును అందుకోవడానికి ఆహ్వానాన్ని జరిగింది.
ఈ పురస్కారానికి ఎంపిక కావడానికి సహకరించిన రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చైర్మన్ రాజన్న, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,సహకరించిన రక్తదాతలకు,రెడ్ క్రాస్ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.