నారద వర్తమాన సమాచారం
అమరావతి
జూన్ :16
రెండున్నారేళ్లలో రాజధాని అమరావతి పూర్తి చేస్తాం… –
రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ – వెలగపూడిలోని సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ – మినిస్టర్ నారాయణను అభినందించిన టీడీపీ శ్రేణులు, రైతులు, జేఏసీ నేతలు రాజధాని నిర్మాణంలో మొదటి దశను రానున్న రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని… పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.. ఆదివారం అమరావతి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా డాక్టర్ పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సచివాలయానికి చేరుకున్న నారాయణకు అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు, జేఏసీ నేతలు పుష్పగుచ్చాలు అందచేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతిపై న్యాయస్థానాల్లో వున్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకొని ప్రారంభిస్తామన్నారు. టాప్ – 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.