Tuesday, May 20, 2025

నేటి నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు షురూ!

నారద వర్తమాన సమాచారం

నేటి నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు షురూ!

అమరావతి

:జూన్ 21
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమా ణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేస్తారు.

ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చ య్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు.

మాజీ సీఎం, వైసీపీ అధ్య క్షుడు జగన్‌ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుసక్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం శాసనసభ సభాపతి ఎన్ని కల ప్రక్రియను ప్రకటిస్తారు.

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్‌ పాస్‌లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. స్థలాభావం కారణంగా విజిటింగ్‌ పాస్‌ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు…

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page