నారద వర్తమాన సమాచారం
అనంతపురం : తుంగభద్రకు 41వేల క్యూసెక్కుల వరద నీరు
కర్నాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద ఉన్న అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో డ్యాంకు జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న తుంగా జలాశయం నిండటంతో అక్కడ 21గేట్లు ఎత్తి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న తుంగభద్రకు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తుంగభద్ర డ్యాంకు వరదనీరు పరుగులు పెడుతోంది. వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లోని హెచ్చెల్సి ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తంచేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.