Tuesday, May 20, 2025

పెండింగ్ లో ఉన్న ఏరియర్స్ వెంటనే చెల్లించాలి

నారద వర్తమాన సమాచారం

పెండింగ్ లో ఉన్న ఏరియర్స్ వెంటనే చెల్లించాలి

మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు

: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:

పురపాలక కేంద్రంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఏరియర్స్ వెంటనే చెల్లించాలని వారు అన్నారు. గత ప్రభుత్వం మే 23 నుండి అమలు చేస్తున్న వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఎలాంటి ఆదేశాలు లేకున్నా కంప్యూటర్స్ ఆపరేటర్స్ కి పెంచిన వేతనాలను వెనకకు తీసుకోవాలని వారు కోరారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని వారు అన్నారు. చైర్మన్ ప్రజాప్రతినిధులు విపక్ష ధోరణి వీడి కార్మికులకు సమన్యాయంగా న్యాయం చేసే విధంగా కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది భాస్కర్, ముత్తమ్మ, చంద్రకళ, శారద, గిరి, శంకర్, హరికృష్ణ, నరేష్, కవిత, బాలస్వామి, రవి, సత్తయ్య, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page