నారద వర్తమాన సమాచారం
బాబా సిదేశ్వర్నాథ్ ఆలయంలో తొక్కిసలాట: ఏడుగురు మృతి
బీహార్ :ఆగస్టు
బీహార్లోని జెహనాబాద్ జిల్లాలో బాబా సిదేశ్వర్ నాథ్ ఆలయంలో తొక్కిస లాట జరిగింది. ఈ తొక్కిస లాటలో ముగ్గురు మహిళ లు సహా ఏడుగురు భక్తులు మరణించారు.మరో 35 మంది భక్తులు గాయ పడ్డారు.
ఈ ఘటన మఖ్దుంపూర్ బ్లాక్లోని వనవర్ పహాడ్ ప్రాంతంలో ఈరోజు తెల్ల వారుజామున చోటుచే సుకుంది. తొక్కిస లాట గురించి సమాచారం అందిన వెంట నే పోలీ సులు, రెస్య్కూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
ఆలయ ప్రాంగణంలో వాలం టీర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగా త్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. నేడు శ్రావణ సోమవారం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శివుని జలాభిషేకం సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట జరిగింది. భక్తు లు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా తోసుకుంటూ ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో గాయపడిన భక్తులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి సిదేశ్వర్నాథ్ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని భక్తులు తెలిపారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగింది.
ఆలయంలో ఉన్న భక్తులు తమ ప్రాణాలను కాపాడు కోవడానికి అక్కడకు ఇక్క డకు పరుగులు తీయడం తీశారు. దీంతో చాలా మంది భక్తులు కిందపడటంతో గాయాలయ్యాయి.
తొక్కిసలాట కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.