నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసరావు పేట మండలం యలమంద గ్రామ పర్యటనకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, ASL నిర్వహించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని నరసరావు పేట నియోజకవర్గం లోని నరసరావు పేట మండలం యలమంద గ్రామమునకు ది.31/12/2024వ తేదీన సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేయుచున్న సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ హెలిపాడ్ గ్రౌండ్ ను,పెన్షన్ పంపిణీ చేసే లబ్దిదారుల గృహాలను,మీటింగ్ జరుగు ప్రాంతాలను,పార్కింగ్ ప్రాంతాలను విజిట్ చేశారు.
31/12/2024వ తేదీన జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఏఎస్ఎల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా CM కార్యక్రమం నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కార్యక్రమం మరియు బందోబస్తు నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని డ్రోన్ ల సహాయం తో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడ్మిన్ ఎస్పీ J.V.సంతోష్ ఏ ఆర్ అదనపు ఎస్పీ సత్తి రాజు , నరసరావుపేట డిఎస్పి K. నాగేశ్వర రావు , ఎస్బి సిఐ – 1 B. సురేష్ బాబు ఎస్బి సిఐ -2 P. శరత్ బాబు ,నరసరావు పేట రూరల్ సీఐ P.రామకృష్ణ ఇతర సిఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.