నారద వర్తమాన సమాచారం
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించండి :పోలింగ్ సిబ్బందిని ఆదేశించిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో మురళి
గుంటూరు-కృష్ణ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ సిబ్బంది నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ మురళి ఆదేశించారు.
ఈనెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులకు సంబంధించి శనివారం స్థానిక కలెక్టరేట్ లోని డాక్టర్ గుర్రం జాషువా సమావేశ మందిరంలో పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పోలింగ్ సామాగ్రి స్వీకరించడం నుంచి పోలింగ్ అనంతరం తిరిగి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను సమర్పించే వరకూ ప్రతి అంశం గురించి వివరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసే విధానం సంక్లిష్టంగా ఉంటుందని, ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటు నమోదు చేసి, బ్యాలెట్ బాక్సులో ఓటు వేసే విధానం గురించి స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఈ ఎన్నికలలో చెల్లని ఓట్లను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల రెవెన్యూ డివిజన్ ల ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, పివోలు, ఏపీవోలు, ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.