నారద వర్తమాన సమాచారం
లైసెన్స్ లేకుండా బల్లకట్లు నడిపితే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్
పల్నాడు జిల్లా నరసరావుపేట
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నందు బల్లకట్టు/ పడవల పై జరిగిన సమావేశము ది.05.03.2025 న సా.4.00గం లకు శ్రీయుత జిల్లా సంయుక్త కలెక్టర్ వారి అధ్యక్షతన జరిగినది, ఈ సమావేశమునందు బల్లకట్టు/ పడవల పై ప్రజలు ప్రయాణించు సమయంలో వారు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు అనుమతులు/ లైసెన్సులు లేకుండా బల్లకట్టు/పడవల ను నడుపు వారి పై తగు చర్యలు తీసుకొనవలసినది గా ఆయా శాఖల అధికారులను ఆదేశించియున్నరు, ఈ కార్యక్రమములో జిల్లా రెవెన్యూ అధికారి ఇ. మురళి , రెవెన్యూ డివిజినల్ అధికారి, సత్తెనపల్లి మరియు గురజాల, డిఎస్పీ గురజాల, జెడ్పీ సీఈఓ గుంటూరు, జిల్లా టూరిజం అధికారి, తహశీల్దార్ లు మరియు పోలీసు సిబ్బంది హాజరు అయినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







