నారద వర్తమాన సమాచారం
రీ – సర్వే , సివిల్ సప్లయస్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే
పల్నాడు జిల్లా,
పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న రీ – సర్వే కార్యక్రమం పై మరియు సివిల్ సప్లయ్ సర్వీస్ లపై మంగళవారం సాయంత్రం పల్నాడు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏ.డి సర్వేయర్,డీ.ఎస్.ఓ (సివిల్ సప్లయ్ ఆఫీసర్), నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ప్రాంతాలకు చెందిన రెవెన్యూ డివిజన్ అధికారులు, పల్నాడు జిల్లాలోని 28 మండలాల తహశీల్దార్లు,డిప్యూటీ తహశీల్దార్లు,డి.ఐ.ఓ.ఎస్. ఎస్ మరియు మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లయ్ సర్వీసులు సక్రమంగా నిర్వహించాలని,సివిల్ సప్లయ్ సర్వీస్ సక్రమంగా లేని చోట వాటిని క్రమబద్ధీ కరించి సక్రమంగా అమల య్యేలా చర్యలు తీసుకో వాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ – సర్వే జరుగుతున్న గ్రామాల్లో రైతులను తీసుకొని వారు సంతృప్తి పడేలా రీ – సర్వే జరగాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏ.డి సర్వేయర్, డీ.ఎస్.ఓ, మూడు రెవెన్యూ డివిజన్ ల ఆర్డీవోలు,తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు,డి. ఐ.ఓ.ఎస్.ఎస్, అన్ని మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.