నారద వర్తమాన సమాచారం
ఉపాధి హామీ పనులు పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు నకరికల్లు పర్యటనలో భాగంగా చల్లగుండ్ల వద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న కూలీ నిధులు ఎంతవరకు సరిపోతున్నాయా దానిపై ఉపయోగం ఉందా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా నీడ ఉందా, మంచినీటిని తెచ్చుకుంటున్నారా అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల లోపల పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రతను బట్టి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫామ్ పాండ్స్ ఉన్న రైతులతో మాట్లాడుతూ జామా మొక్కలు ఎన్ని రోజులకు క్రాప్ వస్తుంది ఎక్కడినుంచి తెచ్చుకున్నారు, ఎన్నిక ఎవరు చేసుకున్నారు , ప్రభుత్వం ఇచ్చిందా, అవసరమైన పేమెంట్లు చేశారా వివరాలు అడిగారు. దీనిపై రైతులు స్పందిస్తూ జంగారెడ్డిగూడెం నుంచి తెచ్చుకోవడం జరిగిందని ఎన్నిక ప్రక్రియ తామే చూసుకున్నామని అవసరమైన పేమెంట్లు చేసేమని తెలిపారు. జాగ్రత్తగా చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ- శ్రమ కార్డ్స్ అందరికీ ఉన్నాయా? వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధలింగమూర్తి , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.