నారద వర్తమాన సమాచారం
పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియను పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్
శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు స్థానిక నరసరావుపేట లోని శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి( రెడ్డి కాలేజ్) కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియను పరిశీలించారు. పరీక్ష పత్రాలను భద్రపరిచిన గదిని పరిశీలించి ఎంత శాతం మూల్యాంకన జరిగింది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లను పరిశీలించి మూల్యాంకన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మూల్యాంకన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.