నారద వర్తమాన సమాచారం
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారికి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించిన కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
జాతీయ యోగా దినం పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బంగ్లా నుంచి పల్నాడు బస్టాండ్ రోడ్డు వరకు రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగ పై వచ్చే నెల 21వ తేదీ వరకు శిక్షణను ఇవ్వనున్న నేపథ్యంలో సదరు స్థలాన్ని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గురువారం ఎస్పీ కంచి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. యోగ నిర్వహించే సమయంలో వాహనాల రాకపోకలను వేరే దారికి మళ్ళించాలని ఆయన సూచించారు. యోగాలో పాల్గొనే వారికి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, రెవిన్యూ డివిజన్ అధికారి మధులత, మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు మరియు మండల రెవెన్యూ అధికారి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.