Friday, September 19, 2025

విద్యుత్ శాఖ లో విజిలెన్స్ తనిఖీలు.. రూ. 3.50 లక్షల అపరాధ రుసుం విధింపు

నారద వర్తమానం సమాచారం

విద్యుత్ శాఖ లో విజిలెన్స్ తనిఖీలు.. రూ. 3.50 లక్షల అపరాధ రుసుం విధింపు

విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం పల్నాడు జిల్లా మాచర్ల డివిజన్ పరిధి మాచర్ల రూరల్ సెక్షన్ పరిధిలో మంగళవారం తనిఖీలు నిర్వహించినట్లు ఈ ఈ సిహెచ్ వెంకటేశ్వరరావు, ఆపరేషన్ ఈఈ ఎస్. సింగరయ్య తెలిపారు. ఈ తనిఖీలో 60 మంది అధికారులు, 180 మంది సిబ్బంది 60 బృందాలుగా ఏర్పడి 5060 సర్వీసులు తనిఖీ జరిగింది. దాచేపల్లి మండలం పరిధి గ్రామాలలో వివిధ రకాలుగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 123 మందిని గుర్తించి రూ. 3.50 లక్షల అపరాధ రుసుం విధించడం జరిగిందన్నారు. విద్యుత్ చౌర్యం నేరం, ఫిర్యాదులను అందించడం లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు అన్నారు. ఈ తనిఖీలు డి ఈఈ లు రవికుమార్, మల్లిఖార్జునరావు, వీరేశ్వర రావు, ఏ ఈఈ లు కోటేశ్వరరావు, సతీష్ కుమార్, శివశంకర్, భగవాన్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading