నారద వర్తమాన సమాచారం
గుంటూరు లో నకిలీ నోట్ల ముఠా అరెస్టు..
బాపట్ల జిల్లా,వాసి బక్క గోపిని పట్టాభిపురం పోలీసులు నకిలీ నోట్లు మార్చుతుండగా అరెస్ట్ చేశారు.
రత్నగిరి నగర్లో నివాసం ఉంటున్న గోపికి హైదరాబాద్ కు చెందిన భరత్ ద్వారా కలకత్తా వాసి గోపాల్ పరిచయమయ్యాడు.
గోపాల్ వద్ద నుంచి గోపి 160 నకిలీ రూ.500 నోట్లు కొనుగోలు చేసి గుంటూరులో మార్చుతున్నాడు. పోలీసులు అతడి వద్ద నుంచి 25 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని కోర్టులో హాజరు పరచగా,రిమాండ్ విధించారు…








