నారద వర్తమాన సమాచారం
గుంటూరు నగరంలో వర్ష ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటన.
వర్షం నీటి వలన ఇళ్లల్లోకి నీరు వచ్చిన చుట్టగుంటలోని మురికిపేటలో నివాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకొని జిఎంసి నుండి అండగా ఉంటామన్న కమిషనర్
పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడని కారణంగా వారికి మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందిస్తామని తెలిపారు
వర్షం అధికంగా కురవడం వలన డ్రైన్ ఓవర్ ఫ్లో జరిగి లో లెవల్ ల్లో ఉన్న మురికిపేటలోకి వెళ్లిన వర్షం నీరు
ఇప్పటికే మురికిపేటలో రోడ్లు మంజూరు చేయడం జరిగింది, త్వరలో అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టి శాశ్వత ప్రాతిపదికన మురుగు నీరు కాలనీలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్న కమిషనర్
రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బంది, అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు
గత ఏడాది కాలం నుండి డ్రైన్లలో పూడిక తీత, ఆక్రమణల తొలగింపు ద్వారా నగరంలో వర్షం వలన పెద్ద ఎత్తున నష్టం కలగలేదన్న కమిషనర్.
మురికిపేటతో పాటు నగరంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలకు అవసరమైన ఆహారం, త్రాగునీరు అందించేందుకు స్థానిక కార్పొరేటర్లు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని, నగర ప్రజలు ఏ సమస్య ఉన్న జిఎంసి కాల్ సెంటర్ 0863 2345103 కి కాల్ చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.