నారద వర్తమాన సమాచారం
పోలవరం ప్రాజెక్టు లో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన పోలవరం ప్రాజెక్టు ను శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది.
సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్ట్ లోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తారు.
జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు.
అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఈ బృందం ఇవ్వనుంది.
అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, జియాన్ఫ్రాన్కో డి సికో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.