ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
పిడుగురాళ్ల :
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 51 (51చెక్కుల) మంది లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు రూ.42,34,920/- (నలభై రెండు లక్షల ముపై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు) రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు 360 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా రూ. 3,80,31,487/-(మూడు కోట్ల యనబై లక్షల ముపై ఒక్క వేయి నాలుగు వందల యనబై ఏడు) రూపాయలు చెక్కుల రూపంలో యరపతినేని అందజేయడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







