నారద వర్తమాన సమాచారం
ఈరోజు జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్విరాట్ పోతులూరువీరబ్రహ్మేంద్రస్వామివారిమఠం మఠాధిపతిఆకస్మిక తనిఖీలు
కందిమల్లయ్యపల్లి
ఈరోజు అనగా ది 8/02/2026 న మఠం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగినది తనిఖీలు భాగంగా
భక్తులకు అందుతున్న వసతి, భోజన సౌకర్యాలు, ప్రాంగణ పారిశుధ్యం పై మఠం మేనేజర్ ఈశ్వరాచారి తో, కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మఠాధిపతి శ్రీ వెంకటాద్రి స్వామి.
నాణ్యత లోపించిన టిటిడి, సదనంలో వసతి గదుల పునర్నిర్మాణం/ ఆధునీకరణ పనుల కొరకు త్వరితగతిన పనులు చేయాలని దాతల సహకారం తీసుకోవాలని మేనేజర్ కి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ ఉపకరణాలు మరమ్మతులు చేసేలా చూడాలి అని సూచించారు. ఎల్లవేళలా పారిశుధ్యం పై శ్రద్ధ వహించాలని పారిశుద్ధ కార్మికులకు హెచ్చరికలు జారీ చేశారు. వసతి గదుల రసీదులు పరిశీలించారు. నిత్య అన్నదాన సత్రంలో అన్నప్రసాద నాణ్యత పెంచాలని సూచనలు జారీ చేశారు.
జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం
శ్రీ వీర బ్రహ్మ క్షేత్రం కందిమల్లయపల్లి
మైదుకూరు నియోజకవర్గం కడప జిల్లా
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







