నారద వర్తమాన సమాచారం
గ్రామ వికాస్ ప్రాంత అభ్యాస వర్గ కార్యక్రమాన్ని నిర్వహించిన.ఏ ఎల్ నరసింహమూర్తి ::: గుంటూరు విభాగ్ సంయోజక్
పల్నాడు :-
గ్రామ వికాస్ కార్యక్రమం లో భాగంగా
ఏప్రిల్ 4,5 తేదీలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఖండ కోమటినేనివారిపాలెం లో ప్రాంత అభ్యాసవర్గ జరిగినవది. ఈ రెండురోజుల కార్యక్రమాలలో గ్రామవికాస్ గురురాజ్ జి ,గ్రామవికాస్ కార్యకారిణి సదస్సులు రమేష్ జీ, గ్రామ వికాస్ ప్రాంత సంయోజక్ తిరుపతయ్య,ఆర్ ఎస్ ఎ స్ గుంటూరు విభాగ్ కార్యవాహ గోలి రామారావు గుంటూరు విభాగ్ సంయోజక్ నరసింహామూర్తి,పల్నాడు జిల్లా సంయోజక్ గోరంట్ల పిచ్చయ్య యాదవ్ మరియు ప్రాంతంలో ఖండ జిల్లా,విభాగ్ సంయోజకులు 2 రోజుల పాటు ఉన్నారు. 1 వ రోజున క్షేత్ర ప్రచారక్ శ్రీభరత్ మార్గదర్శనం, పుస్తక ఆవిష్కరణ మరియు సాయంత్రము కోమటినేనివారిపాలెం,గంగనపాలెం గ్రామాలలో గ్రామ సంకీర్తన,గోపూజ భూసుపోషణ మొక్కలు నాటటమ్ కార్యక్రమాలు రాత్రికి ఆనంద సభ జరిగినాయి.
2 వ రోజు గుడిపల్లి నాగభూషణం 6 ఎకరాల వ్యవసాయ క్షేత్రములో ఉదయం 6 గంటలకు రెండు ఎద్దు నూనె గానుగలు ఒకటి యంత్రం గానుగ కూరకాయల తోటలు ఘన జీవామృతం,ద్రవ జీవామృతం ఎరువులు గోశాల చూసాము. ఆరెస్సెస్ ప్రాంత కార్యకారిణి యుగంధర్ జి మార్గదర్శనం భోజనానంతరం కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం ఆచలానంద ఆశ్రమాధిపతి విరజానంద స్వామి జి మార్గదర్శనం జరిగినది. అలాగే విజ్ఞాన విహార, సింధూ స్కూల్ వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ దర్శనంతొ కార్యక్రమం ముగించారు.ఈ కార్యక్రమం లో గ్రామ వికాస్ ప్రాంత అభ్యాసవర్గ కోమటినేనివారిపాలెం చిలకలూరిపేట ఖండ విభాగం
మరియు
విభాగ్ సంయోజకులు
జిల్లా సంయోజకులు,జిల్లా ఆయామ్ ప్రముఖులు
ఖండ సంయోజకులు
పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








