నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన గుంటూరు రేంజ్ IG సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ మరియు పల్మాడు జిల్లా SP కంచి శ్రీనివాస రావు…
ఈ సందర్భంగా IG ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు రివార్డులను అందజేశారు-
రివార్డులు అందుకున్న వారిలో సత్తెనపల్లి టౌన్ సి.ఐ. బి.బ్రహ్మయ్య ,అమరావతి సి.ఐ యం.శ్రీనివాస రావు చిలకలూరిపేట రూరల్ సి.ఐ బి.సుబ్బనాయుడు , చిలకలూరిపేట టౌన్ సి.ఐ పి.రమేష్ , పిడుగురాళ్ళ సి.ఐ G.వెంకటరావు ,మాచర్ల టౌన్ సి.ఐపి.ప్రభాకర్ , దాచేపల్లి సి.ఐ జి.వెంకట రావు ,కారెంపూడి సి.ఐ టి.వి.శ్రీనివాసరావు , FPB, CID సి.ఐ షైక్.అబ్దుల్ రహేమాన్ , ఎడ్లపాడు స్టేషన్ యస్.ఐ వి.బాలకృష్ణ ,క్రోసూరు యస్.ఐ N.నాగేంద్ర రావు , దుర్గి స్టేషన్ యస్.ఐ యల్.సుదీర్ ,సత్తెనపల్లి టౌన్ యస్.ఐ M.సంధ్యా రాణి , FPB, CID ASI పి.సురేంద్ర బాబు ఉన్నారు.
ఈ సందర్భంగా IG మాట్లాడుతూ పెండింగ్ కేసులను హేతుబద్దంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యలను ఓపికగా విని, ఫలితంగా బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
మహిళలు, బాలికలు, చిన్నారుల పిర్యాదులు అందిన వెంటనే ప్రతిస్పందించి తగు చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీస్ అధికారి గాని సిబ్బంది గాని ఉండేటట్లుగా చూసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా SP గారైన కంచి శ్రీనివాస రావు మాట్లాడుతూ “PGRS” కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా చర్యలు చేపట్టి, పోర్టల్ లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలన్నారు. పోక్సో కేసులు, మహిళల పై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ కేసులు, మిస్సింగ్ కేసులు మొదలైన కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని మరియు సదరు నేరాలు అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారి చేసారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని వేగ నియంత్రకాలు, ట్రాఫిక్ సూచనలను తెలిపే సైన్ బోర్డులను అవసరమైన చోట STOP BOARDS ను ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించారు.
పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలి. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై ప్రతిరోజు రైడ్ లు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించె వారిని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తే నేరాలు కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో స్పందన పిటిషన్లు, POCSO కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, చీటింగ్ కేసులు, 174 Cr.PC కేసులు, మిస్సింగ్ కేసులు, గంజాయి, నాటుసారా ల కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి సమీక్షించారు. జిల్లా ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ దిశ కాల్స్, 112, 100 ఎమర్జెన్సీ నెంబర్ల నుండి వచ్చు కాల్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాటి పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెనువెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. కాల్ వచ్చిన సమయం మరియు సంఘటన స్థలానికి చేరుకున్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యంగా స్పందించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అధికారులను హెచ్చరించారు. రౌడీలు, సస్పెక్ట్ లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వారి ప్రవర్తన ఎలా ఉంది, వారు కొత్త వ్యక్తులను ఎవరినైనా కలుస్తున్నారా, ఏదైనా నేరానికి పాల్పడే అవకాశం ఉంటుందా వంటి సమాచారాన్ని సేకరించుకోవాలన్నారు.
గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాల పై కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ, క్రయ విక్రయాలు పై నిఘా వుంచి వాటిని అరికట్టాలని, గతంలో నాటుసారా సంబంధిత కేసులలో బైండోవర్ చేసిన వ్యక్తులు మరల పట్టుపడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.
విచారణ దశలో వున్న కేసులను సాంకేతిక పరిజ్ఞాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి వేగవంతంగా దర్యాప్తుచేసి సంబంధిత కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలన్నారు.
ఈ సమావేశంలో IG మరియు ఎస్పీ తో పాటు అదనపు ఎస్పి అడ్మిన్ సంతోష్ , ఏఆర్ అదనపు ఎస్పి డి రామచంద్ర రాజు , క్రైం అదనపు ఎస్పి లక్ష్నిపతి , నరసరావు పేట డీఎస్పీ నాగేశ్వర రావు , సత్తెనపల్లి డీఎస్పీ హనుమంత రావు , RI లు, సీఐలు, ఎస్సైలు, DPO అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.