నారద వర్తమాన సమాచారం
శబరిమల యాత్ర టూర్ రూ.11,475 : ఐ ఆర్ సి టి సి
శబరిమల దివ్యక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకొనే యాత్రికులకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది.
అయ్యప్ప భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చింది. ఈ రైలులో వెళ్లి శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలు చూడవచ్చు. నవంబర్ 16న ఉ.8 గంటలకు SCలో బయల్దేరే ఈ రైలుకు NLG, పిడుగురాళ్ల, GNT, తెనాలి, OGL, NLR, గూడూరు, రేణిగుంట, TPTY,
చిత్తూరులో రైలు ఎక్కొచ్చు. 5 పగళ్లు, 4 రాత్రులు రోడ్డు రవాణాతో పాటు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు ఉంటాయి. స్లీపర్ ఛార్జ్ ₹11,475, థర్డ్ఏసీ ఛార్జ్ ₹18,790.
సికింద్రాబాద్ నుంచి శబరిమల కు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నవంబర్ 16 నుంచి 20 వరకు నడపాలని నిర్ణయించింది. టికెట్ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి.బోజనాలు అన్ని రైల్వేసిబ్బందే చూసుకుంటారు. అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.