నారద వర్తమాన సమాచారం :దాచేపల్లి: ప్రతినిధి
క్షుణ్నంగా వాహన తనిఖీలు చేపట్టండి – పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపిఎస్.
దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొందుగల అంతరాష్ట్ర పోలీస్ చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ సార్వత్రిక ఎన్నికలు – 2024 దృష్ట్యా పల్నాడు జిల్లాలోకి ఎటువంటి అక్రమ మద్యం,మరియు పరిమితి కి మించిన నగదు రవాణా కార్యకలాపాలు జరుగకుండా నివారించే విధంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ క్షుణ్నంగా వాహన తనిఖీలు నిర్వహించాలని పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి సూచించిన ఎస్పీవాహన తనిఖీల సమయంలో ఏవైనా వాహనాలు లేదా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మీ పై అధికారులకు తెలియపరచి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ , విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం చూపిన అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ పొందుగల పోలీస్ చెక్ పోస్టు వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం విధులు నిర్వహిస్తూ తనిఖీలు చేపడతారని కావున ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.