నారద వర్తమాన సమాచారం
పోలీస్ ప్రధాన కార్యాలయం నందు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్…
నరసరావుపేట:-
పల్నాడు జిల్లా లోని పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్ ప్రత్యేక శ్రద్ధతో సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం తెలుగు సైబర్ ఆర్మీ ఫౌండర్ & CEO & సైబర్ క్రైమ్ అడ్వైజర్ ఇన్వెస్టిగేటర్ రామాంజనేయులు తో నిర్వహించడం జరిగింది,
ఎస్పీ మాట్లాడుతూ.
- సైబర్ నేరాలు చేసిన నేరస్తులను గుర్తించి నేరాలను ఎలా నియంత్రించాలో తెలియజేయడం జరిగింది.
- సోషల్ మీడియాలో అసభ్యకరమైన మరియు తప్పుడు పోస్టులను సర్కులేట్ చేసే వారిని ఏ విధంగా నిగా ఉంచి వాటిని అరికట్టే విధానాన్ని తెలియపరిచినారు.
- అదేవిధంగా ముద్దాయిలను గుర్తించడంలో IP అడ్రస్ మరియు IPDR లను ఎలా అవగాహన చేసుకోవాలో తెలిపినారు. ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువవుతున్నాయి వాటి నిరోధించడానికి పోలీసు అధికారులు తీసుకోవలసిన చర్యలు గురించి, కార్యక్రమ ప్రాధాన్యత గురించి తెలిపినారు.
ముఖ్యఅతిథిగా పాల్గొనిన రామాంజనేయులు సైబర్ క్రైమ్ యొక్క ప్రాధాన్యత, సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వెంటనే పోలీసు అధికారులు తీసుకొనవలసిన చర్యల గురించి, వాటిని ఎంతవరకు మనం నిర్మూలించవచ్చునో ప్రజలకు ఏ విధంగా అవగాహన చేయాలో తెలపడం జరిగింది.
ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో సీఐలు,ఎస్ఐ లు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని సైబర్ క్రైమ్ గురించి తెలిపిన తెలుగు సైబర్ ఆర్మీ ఫౌండర్ రామాంజనేయులు కి పల్నాడు జిల్లా ఎస్పీ దుస్సాలువా తో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.