Thursday, March 12, 2026
spot_img

నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే పోలీస్ సిబ్బందికి అండగా ఉంటాం – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ  జె .వి . సంతోష్…

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్…

నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే పోలీస్ సిబ్బందికి అండగా ఉంటాం – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ  J.V. సంతోష్

మరణించిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీస్ శాఖ తరపున ఆర్ధిక సహాయం చెక్కును అందజేసిన జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) JV సంతోష్

ది.10.10.2024 వ తేదీన పల్నాడు జిల్లా AR విభాగం నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న N. వెంకటేశ్వర్లు AR HC 1412 ఆకస్మాత్తు గుండెపోటు కారణంగా మరణించడం జరిగినది.

ఈరోజు అనగా ది.10.12.2024 వ తేదీన అతని భార్య అయిన నల్లబోతుల యల్లమ్మ కి పోలీస్ అసోసియేషన్ చేయూత Fund కింద Rs.1,00,000/- చెక్కును అదనపు ఎస్పీఅందజేసినారు.

ది. 30.10.2024 వ తేదీన పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేయుచున్న సందేపోగు శ్యామ్ ప్రసాద్ HC 348 గుండె పోటు వలన మరణించగా వాని భార్య అయిన శ్రీమతి S.నిర్మలా దేవి కి పోలీస్ అసోసియేషన్ ద్వారా చేయూత కింద Rs. 1,00,000/- చెక్కును అదనపు SP  అందజేసినారు.

ఈ కార్య్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) J.V. సంతోష్ తో పాటు AR అదనపు ఎస్పీ సత్తిరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ AAO KVD రామా రావు మరియు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ T. మాణిక్యాల రావు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading