నారద వర్తమానం సమాచారం
రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాలు
రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై ఉండవల్లిలోని తన నివాసంలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో..
▪️కుప్పం
▪️దగదర్తి
▪️శ్రీకాకుళం
▪️తాడేపల్లిగూడెం
▪️నాగార్జునసాగర్
▪️తుని- అన్నవరం
▪️ఒంగోలు
కొత్త విమానాశ్రయాలను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది. రెండు దశల్లో 1,383 ఎకరాల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.