నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు
పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ ఆవరణంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రంగవల్లుల పోటీలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంక్రాంతి సంబరాలు కొనసాగాయి. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు కలెక్టరేట్ ప్రాంగణంలోని రోడ్లను రంగవల్లులతో అందంగా అలంకరించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, ఆర్డిఓ మురళిలు తెలుగువారి సంప్రదాయ వస్త్రాలంకరణలో ప్రధానంగా భావించే కండువాలను ధరించి కనువిందు చేశారు. రంగవల్లుల పోటీల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలుగు వారి పండగ సంక్రాంతిని సంతోషంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.