నారద వర్తమాన సమాచారం
భార్యను హత్య చేసి శరీర భాగాలను కుక్కర్లో ఉడికించిన భర్త
రంగారెడ్డి జిల్లా:
భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసిన కసాయి భర్త – మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన వైనం – భార్యతో విభేదాలే కారణం
క్షణికావేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్యతో సంబంధం లేదని నిరూపిం చుకునేందుకు అత్యంత దారుణమైన రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి, దంచి చెరువులో విసిరేశాడు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీచెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం డీఆర్డీవోలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బంది గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగా రెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
అప్పుడప్పుడు భార్యతో చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతోంది. ఈనెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యభర్తల మధ్య తగాదా జరిగింది,ఆ గొడవకు కారణాలేంటో తేలియలేదు. సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారు లను తీసుకువచ్చే విష యంపై భేదాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైనట్లు సమాచారం.
ఈ క్రమంలోనే మాధవి తలపై గురుమూర్తి రెండుసార్లు గట్టిగా కొట్టగా స్పృహతప్పి పడిపోయింది. అకస్మాత్తుగా కిందపడి పోవడం, అపస్మారక స్థితి లోకి వెళ్లడంతో నిందితుడు మరణించినట్లు భావించా డు. ఆ విషయం బయటకు వెళ్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో మృతదేహాన్ని అదృశ్యం చేయాలని నిర్ణయించాడు.
భార్య ఇంట్లో నుంచి వెళ్లిపో యిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను కేసు నుంచి తప్పించుకో వాలని పథకం వేశాడని తెలుస్తోంది. నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చు కుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని తెలుస్తోంది.
ఆ ముక్కల్ని వంటగదిలోని కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని సమాచారం. ఆ మొత్తాన్ని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.
నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తులు వేసినట్లు పోలీసులు చెప్తున్నారు భార్యను 16న చంపేసినా ఎవరికీ చెప్పలేదు. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్నగొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు.
పోలీసులకు ఫిర్యాదు చేయాలని అత్తకు చెప్పింది నిందితుడేనని తెలుస్తోంది. హత్య విషయం తెలియని ఆమె 18న మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఫిర్యాదు చేసేందుకు ఆమెతో పాటు నిందితుడు వెళ్లినట్లు తెలుస్తోంది.
వెంకటమాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటిముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ కెమెరాల్లో వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయట కెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు రికార్డుకాగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నిం చారు.ఈక్రమంలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది.
విచారణలో భాగంగా తొలుత నిందితుడు పొంతనలేని సమాధానా లిచ్చినట్లు సమాచారం. పలుమార్లు ప్రశ్నించాక అసలు విషయం వెల్లడిం చాడు. మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.