నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళ…..
నరసరావుపేట :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద(APSSDC) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది.
పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఈ. తమ్మాజి రావు మాట్లాడుతూ, ఈ రోజు అనగా 28-01-2025 న NAC ట్రైనింగ్ సెంటర్, కార్మిక శాఖ కార్యాలయం ప్రాంగణం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర, లింగంగుంట్ల, నరసరావుపేట, పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ ను నిర్వింహించడం జరిగింది. ఈ జాబ్ డ్రైవ్ కు 4 కంపెనీలు హాజరు కాగా 103 మంది హాజరుఅయ్యారు అందులో 48 మంది ఉద్యోగాలకు ఏంపిక అయ్యారని తెలియజేసినారు.
ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిధి, NAC ట్రైనింగ్ సెంటర్ ఏ.డి నరసింహారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారు ఈ జాబ్ మేళ ను నరసరావుపేటలో నిర్వహించడం చాలా సంతోషకరం అని తెలియజేశారు మరియు నియామక పత్రలు అందుకున్న యువతకు అభినందలు తెలుపుతు మరియు వారిని మరెన్ని ఉన్నత శిఖరాలను అందుకునే విధంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలియచెసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది జిల్లా ప్లేస్మెంట్ అధికారి యం. రవీంద్ర నాయక్, నరసరావుపేట స్కిల్ హబ్ కోఆర్డినేటర్ యం.వీరాంజనేయులు,జె.సురేష్ కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు, సీడాప్ PO నాగుల్ మరియు YP ఇ.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.