నారద వర్తమాన సమాచారం
ప్లాస్టిక్ వస్తువులు నిషేదించాలి. పిడుగురాళ్ల కమిషనర్ పర్వతనేని శ్రీధర్
పిడుగురాళ్ల:-
పిడుగురాళ్ళ పురపాలక సంఘ పట్టణ పరిధిలోని వ్యాపారస్తులకు, దుకాణదారులకు, తోపుడు బండ్ల పై వ్యాపారం చేయు వారికీ, ప్రజలకు విజ్ఞప్తి, ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్గులు (120 మైక్రోన్స్ కన్నా తక్కువ) మరియు సింగల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించుచూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్రెటరి, APPCB, విజయవాడ. ద్వారా ఉత్తర్వులు జారి చేసియున్నారు.
పై తెలిపిన నిబంధనలు పిడుగురాళ్ళ పురపాలక పట్టణములో కూడా అమలులో ఉన్నవి కావున పిడుగురాళ్ళ పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ వాడకమును నిషేధించుటకు మరియు PWM-RULES-2016 ప్రకారము చేయబడిన నియమ నిబంధనలు కఠినముగా అమలు పరచుటకై పురపాలక మరియు సచివాలయ సిబ్బందితో నిఘా బృందములు ఏర్పాటు చేయడమైనది.
ఈ నిషేధమును ఉల్లంఘించిన వ్యాపారస్తులకు, దుకాణదారులకు, తోపుడు బండ్ల పై వ్యాపారం చేయు వారికి 500/- నుండి 25,000/- వరకు పెనాల్టీ విధించబడును, నిషేదించిన ప్లాస్టిక్ ఐటమ్స్ సీజ్ చేయబడును మరియు ఈ నిషేధము ఉల్లంఘించిన వారిని ఎన్విరాన్మెంట్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1986 ప్రకారం ప్రాసిక్యూషన్ చేయబడును.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.