నారద వర్తమాన సమాచారం
స్వచ్ఛ నగరాలు స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ ఆంధ్రా. స్వచ్ఛభారత్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు శాసనసభ్యులు అరవింద్ బాబు…
నరసరావుపేట :-
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు…స్వచ్ఛ గ్రామాలు… స్వచ్ఛ ఆంధ్రా… స్వచ్ఛభారత్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది…
ఈ కార్యక్రమం లో భాగంగా ఏప్రిల్ మూడో శనివారం ఇ -చెక్ అనే థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది..
నరసరావుపేట లోని స్థానిక గాంధీ పార్క్ వద్దస్వర్ణాంధ్ర- స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ,శాసన సభ్యులు చదలవాడ అరవింద బాబు
ఈ – వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమం లో భాగంగా ఇండ్లు, హాస్పిటల్స్,
ప్రభుత్వ కార్యాలయాలు,ప్రైవేట్ సంస్థల నుండి ఉత్పన్నమయ్యే కంప్యూటర్లు,టీవీలు రేడియో,మొబైల్ ఫోన్ లు, వాషింగ్ మిషన్లు, మైక్రో ఓవెన్లు,సిడి ప్లేయర్లు, ఫ్యాన్లు మొదలగు వస్తువులను పర్యావరణ హితంగా నిర్వహించడం ద్వారా రీసైక్లింగ్ చేయడంపై అవగాహన ప్రదర్శనను అధికారులు ఏర్పాటు చేశారు
మెప్మామరియు మున్సిపాలిటీ అధ్వర్యం లో ఏర్పాటు చేసిన స్టాల్స్ నుఈ – వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కు సంబంధించిన ప్రదర్మన ను జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు పరిశీలించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.