Friday, November 21, 2025

పల్నాడు జిల్లా నందు హోటల్స్, లాడ్జి ల నందు పోలీసుల ఆకస్మిక తనిఖీలు

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా నందు హోటల్స్, లాడ్జి ల నందు పోలీసుల ఆకస్మిక తనిఖీలు

పల్నాడు జిల్లా నందు శాంతి భద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్  ఆదేశాల మేరకు, వివిధ హోటల్స్, లాడ్జిలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో అనుమానితుల వివరాలను సేకరించడం, హోటల్స్ మరియు లాడ్జీ ల
లాగ్ బుక్స్ ను పరిశీలించడం, గుర్తింపు పత్రాల నమోదు విధానం తదితర అంశాలపై ఖచ్చితమైన తనిఖీలు చేపట్టారు.

గైడ్‌లైన్స్ ప్రకారం నడవాలని లాడ్జి యాజమాన్యాలకు స్పష్టమైన సూచనలు చేయబడ్డాయి.

మహిళల భద్రత, శాంతి స్థాపన, మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ ఎస్పీ  తెలిపారు.

పరారీలో ఉన్న నిందితులు, అనుమానితులు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచేందుకు ఈ తనిఖీలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలను మరింత కఠినంగా కొనసాగించనున్నామని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading