నారద వర్తమాన సమాచారం
ఆధునీకరణ లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు ( పి ఏ సి ఎస్) ను ( ఈ. పి ఏ సి ఎస్ )గా మార్చ బడింది
నరసరావుపేట:-
ప్రభుత్వం సహకార సంఘాల ఆధునీకరణ దిశగా తీసుకుంటున్న ముఖ్యమైన చర్యల్లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు ( పి ఏ సి ఎస్) ను ( ఈ. పి ఏ సి ఎస్ )గా మార్చడం జరిగింది. ఈ మార్పు వల్ల ప్రతిరోజు నిర్వహించే ప్రక్రియల నుంచి నిర్వహణ వరకూ అన్ని కార్యకలాపాలు డిజిటల్ గా చేయడం జరుగుతుందని జిల్లా సహకార అధికారి ఎమ్. వెంకటరమణ అన్నారు. సహకార సంఘాల కంప్యూటీకరణ చేసిన తర్వాత నిర్వహించవలసిన ఆడిట్ పై ఇ ఆడిట్ శిక్షణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ యూనియన్ అద్వర్యం లో మంగళవారం కేంద్ర సహకార బ్యాంకు నరసరావుపేట బ్రాంచి లో సహకార శాఖ ఆడిటర్లకు, చార్టెడ్ అకౌంటెంట్ లకు, సంఘాల సీ ఈ ఓ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి మాట్లాడుతూ (పి ఎ సి ఎస్ ) ల ఖాతాల పరిశీలన, లావాదేవీల పరిశీలన, భద్రతా ప్రమాణాలు మొదలైనవి ఆన్లైన్ విధానంలో నిర్వహించబడతాయని తెలిపారు. దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. కేంద్రీకృత నిఘా మరియు నియంత్రణ ఉంటుందని రాష్ట్ర, జాతీయ స్థాయి నుంచి ( పి ఏ సి ఎస్ ) ల పనితీరుపై నేరుగా పర్యవేక్షణ సాధ్యమవుతుంది అని అన్నారు. జిల్లా సహకార ఆడిట్ అధికారి డి. శ్రీనివాసరావు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ సంఘ లావాదేవీలు ఖాతాలు, రికార్డులు స్పష్టంగా ఉండి అవినీతి అవకాశాలు తగ్గుతాయని, మానవ దోషాలేమీ లేకుండా కంప్యూటరైజ్డ్ విధానంలో త్వరగా ఆడిట్ పూర్తి చేయవచ్చని తెలిపారు. ఖచ్చితమైన డేటా నిర్వహణ ఉంటుందని, భద్రతతో భద్రపరచబడుతుందని పేర్కొన్నారు.గత ఆడిట్లతో పోలికలు వేయడం సులభమని, మానవ వనరులు, పేపర్ వాడకం తగ్గి, పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందని చెప్పారు. ఇకపై సంఘాలు సభ్యులకు మెరుగైన సేవలు అందించగలవని, తక్కువ సమయంలో ఖాతాలు చూసే, రుణ వివరాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా, (ఈ పి ఏ సి ఎస్) మరియు ఈ-ఆడిట్ వ్యవస్థలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారుతున్నాయని అన్నారు. ఈ ఆడిట్ ఎలా చేయాలో డిపార్ట్మెంట్ సిబ్బందికి , ఛార్టర్డ్ అకౌంటెంట్స్ కు శిక్షణ ఇచ్చి వారి సందేహాలను తీర్చారు. ఈ కార్యక్రమం లో సహకార శాఖ ఆడిటర్ లు , సి ఎ లు, సీఈఓ లు పాల్గొన్నారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.