నారద వర్తమాన సమాచారం
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించడం
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని నివారించడానికి జిల్లా కలెక్టర్ రవాణా శాఖ, పోలీస్ శాఖ వారిని జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
ఈ ఆదేశాల మేరకు తేది 22-05-2025 న ఆర్టీసీ మరియు రవాణా శాఖ అధికారులు సత్తెనపల్లి నుండి క్రోసూరు వెళ్లే రహదారిలో తనిఖీలు నిర్వహించడం జరిగినది.
ఈ తనిఖీలలో భాగంగా పరిమితికి మించి ప్రయాణం చేస్తున్న వాహనములపై కేసులు నమోదు చేయడం జరిగినది. ఈ తనిఖీలలో ఆటో రిక్షాలు వాహనములపై తనిఖీలు నిర్వహించి 14 వాహనాలపై కేసు నమోదు చేసి అందులో ఒక వాహనములను సీజ్ చేయడం జరిగినది, Rs.42,000/-, అపరాధ రుసుము సేకరించడమైనది.
ఈ తనిఖీలలో సత్తెనపల్లి ఆర్టీసీ డి ఎం రవాణా శాఖ వారి తరపునుంచి సహాయ తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని దీనివల్ల రోడ్లపై జరిగే ప్రమాదాలను నిర్మూలించవచ్చని తెలియపరచడమైనది.
జిల్లా రవాణాశాఖ అధికారి,
జి సంజీవ్ కుమార్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.