Saturday, July 19, 2025

చదువులలోప్రతిభ కనపరిచిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు. ప్రతిభా పురస్కారాలు అందజేసిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం

నారద వర్తమాన సమాచారం

చదువులలోప్రతిభ కనపరిచిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు. ప్రతిభా పురస్కారాలు అందజేసిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం


దర్శి

దర్శి లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసా చారి అధ్యక్షుతన జరిగిన సమావేశంలో.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఈ సంవత్సరం పదో తరగతి ఇంటర్మీడియట్ అత్యధిక మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థి విద్యార్థులు. పదవ తరగతిలో. నండూరి వెంకట నాగ సాయి కీర్తన 594 మార్కులు సాధించగా మరియు 500 పైన మార్పులు సాధించిన 60 మంది విద్యార్థులను . ఇంటర్లో. ఆకుమల్ల తిరుమల సాయి దీప్తి 975 మార్కులు సాధించినందున. వీరితోపాటు 850 మార్కులు సాధించిన 15 మంది. విద్యార్థులను. iit. Net. iiit. లో గతంలో సీట్లు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులు మొత్తం 80 మంది విద్యార్థిని విద్యార్థులను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేసి. ప్రోత్సాహక బహుమతులు అందించడమైనది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విశ్వబ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించే దశగా. అలాగే డబ్బుల్లేక ఎవరూ చదువు ఆపకూడదు అనే ఉద్దేశంతో ఈ సంఘం పనిచేస్తుంది అన్నారు. ముఖ్యఅతిథిగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సింహాద్రి కనకాచారి జ్యోతి ప్రజ్వల చేసి. మాట్లాడుతూ సేవా కార్యక్రమం చేయడంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆదర్శనీయమని కొనియాడారు. విశ్వబ్రాహ్మణ విద్యార్థులు ఉన్నచ చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విదేశీ ఉన్నత విద్యా పథకాన్ని ఉపయోగించుకోవాలని. అలాగే విద్యాపరంగా ప్రభుత్వ అవసరం అయినచో అండగా ఉంటానని. ఈ కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని త్వరలో ఆదరణ2 స్కీమ్ మొదలవుతుందని. చేతివృత్తిదారులైన విశ్వబ్రాహ్మణ లు ఎక్కువగా ఉపయోగించుకోవాలని అన్నారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు సన్మానించి ప్రోత్సహి బహుమతులు కి. 110000 రు లను ( విద్యార్థులకు) అందించడమైనది. దొడ్డేటిపల్లి రామాచారి. అద్దంకి వెంకట అజయ్ కుమార్. సామంతపూడి నాగేశ్వరరావు. కడియాల సుబ్బారావు..ఈ దు మూడి రవి ప్రసాద్.ఈదు మూడి ప్రసాదు.. కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు రాచర్ల వెంకట రాజశేఖర్. కంచర్ల శ్రీనుబాబు. గుత్తికొండ కళ్యాణ్ తువ్వ పాటి జనార్ధనా చారి . పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో మహిళలు విద్యార్థిని విద్యార్థులు దాదాపు 350. మంది పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading