నారద వర్తమాన సమాచారం
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన దివ్యాంగుని వద్దకు స్వయంగా వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్న పల్నాడుజిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
ప్రతి సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈరోజు (26/05/2025)
సోమవారం నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో వీల్ చైర్ లో వచ్చిన బొల్లాపల్లి మండల వాసి ఎం సుధాకర్ దివ్యాంగుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరయ్యారు. సదరు విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు స్వయంగా ఎం సుధాకర్ వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించే విధంగా తన ఉదారతను చాటుకున్నారు. అందులో భాగంగా సంబంధిత సేర్ఫ్ ceo తో ఫోన్లో మాట్లాడి ఎం సుధాకర్ పింఛను సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మానవతా దృక్పథంతో సుధాకర్ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఝాన్సీ రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. రవి తదితరులు పాల్గొన్నారు…..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.