నారద వర్తమాన సమాచారం
యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయండి : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
జిల్లాలో యోగాంధ్ర యాప్ ద్వారా యోగా ఔత్సాహిక రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 8 లక్షల మందిని యోగా ఔత్సాహికులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ లక్ష మంది నమోదు పూర్తయిందన్నారు. వీరితో పాటూ 4,800 వరకూ మాస్టర్ ట్రైనర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
మంగళవారం మధ్యాహ్నం యోగాంధ్ర కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రేపు ఉదయం 8.00 గం.ల లోగా గ్రామ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించి విజేతల వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలన్నారు. గ్రామ స్థాయిలో విజేతలకు జూన్ 2 నుంచి మండల స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.