నారద వర్తమాన సమాచారం
సమస్యలు పరిష్కారంలో భాగంగా మరుగుజ్జు వారి సమస్యలు పై మెడికల్ బోర్డుకి సిఫార్సు చేసిన కలెక్టర్ అరుణ్ బాబు ఐఏఎస్
సోమవారం నాడు స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన ప్రజాపిర్యాదుల దినోత్సవం లో భాగంగా నర్సరావుపేట 6వ వార్డు బాబాపేట కు చెందిన మండ్ల మరియమ్మ పుట్టుకతోనే రెండు చేతులు రెండు కాళ్ళు లేవు , అదేవిధంగా నర్సరావుపేట 6 వ వార్డు బాబాపేట కు చెందిన షేక్ మస్తాన్ బీ కుమారులు, షేక్ ఇస్మాయిల్, 35సంవత్సరాలు, షేక్ సుభాని 32 సంవత్సరాలు మరిగుజ్జు వాళ్ళు వారి సమస్యలను తెలుపుకునేందుకు కలెక్టర్ కార్యాలయం లోకి వచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తక్షణమే స్పందించి వారి వద్దకు వెళ్లి విషయాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 6,000 పెన్షన్ వస్తున్నదని కానీ 10,000 పెన్షన్ కావాలని అర్జీలు ఇవ్వడం జరిగిందని పింఛన్ మంజూరు కాలేదని 10 వేల రూపాయలు పెంచవలసిందిగా కలెక్టర్ కి అర్జీ రూపంలో విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ బాబు తక్షణమే మెడికల్ బోర్డు కు సిఫార్సు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారి మధులత, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ బి వి రవి పాల్గొన్నారు…..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.