నారద వర్తమాన సమాచారం
డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం నిర్వహించాలి
మాచర్ల ఆర్టీసీ డిపో డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నరసరావుపేట డి పి టి వో పరిధి పిడుగురాళ్ల, సత్తెనపల్లి డిపోలలో డయల్ యువర్ డి ఎం ప్రోగ్రాం జరుగుతుంది. మాచర్ల డిపో లో గత నవంబర్ ఆ తరువాత మార్చి లో ప్రోగ్రాం జరిగిందని గత 3 నెలలుగా డయల్ యువర్ డిఎం జరుపలేదన్నారు. గతంలో కర్నూలు బస్సు సర్వీసు పునరుద్దించాలని 33 మంది , ఆ తరువాత నెలలు 25 ప్రయాణికులు డయల్ యువర్ డి ఎం ప్రోగ్రాంకు తెలియజేశారు. నెల్లూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి, ఈడీ నెల్లూరుజోనల్ -3 అధికారి G. నాగేంద్ర ప్రసాద్, డి పి టి ఓ M. మధు పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మాచర్ల నుండి కర్నూలు బస్సు సర్వీస్ పునరుద్ధరణ గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే సాకుతో డయల్ యువర్ డి ఎం నిర్వహించలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.