నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ఇరువూరి శ్రీనివాసులు..
పిడుగురాళ్ల
ఈ రోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కమీషనర్ పట్టణ టీడీపీ అధ్యక్షులు, ఇతర స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మరియు కమీషనర్ మాట్లాడుతూ – పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా, శుభ్రమైనటుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.