నారద వర్తమాన సమాచారం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాక్.. 20 వేల ఇళ్లు రద్దు!
తెలంగాణ :
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో భాగంగా సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇవన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ నియమాల ప్రకారం లేవని అధికారులు ఆ ఇళ్లను రద్దు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 20 వేల ఇండ్లను రద్దు చేశారని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.