నారద వర్తమాన సమాచారం
ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కలెక్టర్ అరుణ్ బాబు
నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ నందు గల శ్రీనివాస తిరుమల ఫర్టిలైజర్స్ షాపు నందు కలెక్టర్ మరియు ఎస్పీ స్వయంగా వెళ్లి తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా స్టాక్ రిజిస్టర్,బిల్ బుక్స్, ఇన్వాయిస్ లు పరిశీలించడమైనది.
యూరియా భౌతిక నిల్వలు వ్యత్యాసం ఉన్నందున 108 బస్తాలకు అమ్మకాలను నిలుపుదల చేయడమైనది.
ఎరువుల డీలర్ వద్ద వారు అమ్మకం జరిపిన రైతుల యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని, ఎరువులను అధిక ధరలకు విక్రయించిన,ఇతర రాష్ట్రాలకు అమ్మకం జరిపిన సంబంధిత డీలర్ పై ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు,పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు తో పాటు నరసరావు పేట RDO K.మధులత నరసరావు పేట MRO K.గోపాల్ రావు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సి.ఐ
K.చంద్రశేఖర్, AO
CH.ఆదినారాయణ మరియు మండల వ్యవసాయ అధికారి
I.శాంతి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.