నారద వర్తమాన సమాచారం
గుంటూరు జిల్లా,లో మట్టి మాఫియాను పెంచి పోషిస్తున్న మైనింగ్ అధికారులు
మైనింగ్ శాఖలో ఒక అధికారి పాత్ర కీలకం, లక్షలు దండుకుంటున్న అధికారి
వందలాది లారీలతో ప్రకృతి వనరుల దోపిడీ.. ప్రేక్షకపాత్రలో అధికారులు…
అనుమతులు లేకుండా కైలాసగిరి కొండ తవ్వకాలు..
ప్రకృతి అందాలకు నెలవైన కైలాసగిరి కొండ ఇప్పుడు మట్టి మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా కొండను యథేచ్ఛగా తొలిచేస్తున్నారు. పేరేచర్ల సమీపంలోని సర్వే నెంబర్ 581లో గురువారం ఈ అక్రమ తవ్వకాల పర్వం పరాకాష్టకు చేరింది. వందలాది భారీ లారీలు, టిప్పర్లు ఏకధాటిగా కొండ మట్టిని తరలిస్తూ ప్రకృతి వనరులను కొల్లగొట్టాయి.
పట్టపగలే ఇంత పెద్ద ఎత్తున అక్రమ దందా జరుగుతున్నా సంబంధిత మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు తెలియకుండానే ఈ భారీ దోపిడీ జరుగుతోందా? లేక మాఫియాతో కుమ్మక్కై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానిక ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.